School Bus | ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Ghaziabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు (School Bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే (Delhi -Meerut Expressway)పై రాహుల్ విహార్ సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని ఘాజీపూర్ నుంచి రాంగ్ రూట్ లో వెళ్తున్న పాఠశాల బస్సు.. అదే సమయంలో మీరట్ నుంచి గురుగ్రామ్ వైపు వెళ్తున్న ఎస్యూవీ కారు (SUV Car)ను ఢీ కొట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రామానంద్ కుష్వా తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read..
Madhya Pradesh | బాధితుడు ఒకరైతే.. మరొకరి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం.. కావాలనే డ్రామా ఆడారా?
IND vs BAN | నేడే మహిళల రెండో టీ20.. బంగ్లాదేశ్తో ఢీకొట్టనున్న భారత్