IND vs BAN | మీర్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మంగళవారం రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో స్పిన్నర్ల విజృంభణకు సీనియర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడు తోడవడంతో సునాయాసంగా నెగ్గిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకోవాలని హర్మన్ బృందం భావిస్తుంటే.. సమం చేయాలని బంగ్లా ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. గత మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్లోనైనా సత్తాచాటుతారా చూడాలి.