తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల విడుదలపై (Producers council)నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ కల్యాణ్ (C kalyan)అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగువాళ్లు తెలుగు సినిమాల (Telugu cinema)ను చంపుకోకూడదని సూచించారు. తమిళ్, కన్నడ వాళ్లు వాళ్ల సినిమాలను శాసిస్తారు. తెలుగు వాళ్లంతా అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారన్నారు.
సంక్రాంతి సందర్భంగా సినిమాలకు థియేటర్లు లేకపోవడం సహించరాని విషయం. థియేటర్లు ఇవ్వకపోవడం చిరంజీవి, బాలకృష్ణను అవమానించడమే అని సి కల్యాణ్ అన్నారు. థియేటర్ల కేటాయింపులో మైత్రీ మూవీ మేకర్స్ ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ మైత్రీ మూవీ మేకర్స్ ఫిర్యాదు చేస్తే ఫిల్మ్ ఛాంబర్ తప్పకుండా పరిశీలిస్తుందని అన్నారు. విజయ్ వారసుడు సినిమా విషయంలో దిల్రాజును తప్పుపట్టడం సరికాదు. ఈ విషయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నియమ నిబంధనకు కట్టుబడి ఉన్నట్టు దిల్ రాజు తెలియజేయాలని కోరారు.
సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలతోపాటు విజయ్ నటించిన వారసుడు (వారిసు), అజిత్ నటించిన తునివు చిత్రాలు ఇడుదలవుతున్నాయి. వీటితోపాటు విద్యా వాసుల అహం సినిమా కూడా విడుదలవుతుంది. మరి థియేటర్ల విషయంలో ఏ సినిమాకు ఎన్ని దొరుకుతాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Read Also : Rahul Yadav Nakka | మూడేళ్లుగా ఏ సినిమా చేయకుండా మాతో జర్నీ.. మసూద హీరో తిరువీర్పై నిర్మాత
Read Also :Ravi Teja | థియేటర్లలో మీరే చూస్తారు కదా.. అభిమానులకు రవితేజ హామీ
Read Also : Padara Padara Lyrical Song | శాసనసభ నుంచి పదర పదర లిరికల్ వీడియోసాంగ్