ఉప్పెన సినిమాతో డైరెక్టర్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే బుచ్చిబాబు కాంపౌండ్ నుంచి రాబోయే రెండో సినిమాపై మాత్రం ఏదో ఒక వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమాకు అంతా సిద్దమైనా.. ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో టైం వృధా చేయకుండా బుచ్చిబాబు ఇదే కథను రాంచరణ్ (Ram Charan)కు వినిపించగా.. అతడికి స్క్రిప్ట్ నచ్చిందని ఇన్సైడ్ టాక్. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం లేదట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్తో సన్నిహిత సంబంధాలున్న సతీశ్ కిలారు సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
తొలి సినిమానే రూ.150 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రాంచరణ్-బుచ్చి బాబు సినిమా రానుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఆర్సీ 15 సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు రాంచరణ్. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్