వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), వీరసింహారెడ్డి, వారిసు (Varisu) సంక్రాంతి బరిలో నిలువబోతున్నాయని తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, విజయ్.. ఈ ముగ్గురూ స్టార్ హీరోలే కావడంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకునేందుకు పాపులర్ బ్యానర్లు గట్టిగానే ప్రయత్నం చేశాయి. అయితే ఫైనల్గా శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ (Shloka Entertainments) ఈ భారీ సినిమాల పంపిణీ హక్కులను దక్కించుకుంది.
ఇప్పటికే బింబిసార, సర్కారు వారి పాట లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ పంపిణీ చేసింది. తాజా అప్డేట్ ప్రకారం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వారిసు ఉత్తర అమెరికా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకాదు రాంచరణ్ -శంకర్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15, విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఖుషీ సినిమా పంపిణీ హక్కులను కూడా భారీ మొత్తానికి దక్కించుకుంది.
2023 సంక్రాంతి రిలీజ్ చిత్రాలు ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ చేశాయి. ఒక్కసారి మేకర్స్ విడుదల తేదీలను ప్రకటిస్తే.. ఈ సినిమాలు చేసే బిజినెస్పై ట్రేడ్ అనలిస్టులు ఓ అంచనాకు వచ్చే అవకాశాలుంటాయి.
మొత్తానికి శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల పంపిణీ హక్కులు సొంతం చేసుకుని.. విడుదలకు ముందే సక్సెస్ అందుకుందంటున్నారు సినీ జనాలు. అన్నీ పెద్ద సినిమాలే కావడంతో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్కు కాసుల వర్షం కురవడం ఖాయమని, ఇప్పటినుంచే లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.
శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ వీడియో..
Heartful thanks to @PharsFilm
For the Opportunity ❤️👏Stay Glued for massive updates 🔜🚨 pic.twitter.com/PFb7fmJMWH
— Shloka Entertainments (@ShlokaEnts) November 21, 2022