ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూన్ 28 : జూలై 1 నుంచి 10 వరకు చేపట్టనున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలతో సోమవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, వి ద్యుత్ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో స్థానిక ప్రజప్రతినిధులను భాగప్వాములను చేయాలని సూచించారు. మండలానికో ఎంపీడీవో స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా, ప్ర త్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు గ్రామసభ నిర్వహిం చి చేపట్టాల్సిన పనులను గుర్తించి వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీ సీఈవో రత్నమాల, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి రవికృష్ణ, డీపీవో శ్రీ కాం త్ , పంచాయతీరాజ్ ఈఈలు రా మ్మోహన్, దత్తు, అధికారులు పాల్గొన్నారు.