చెన్నారావుపేట, జూన్ 9 : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని ఎంపీడీవో లలిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించాలన్నారు. వర్షాకాలం మొదలైనందున పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె కోరారు. నీటి నిల్వలున్న ప్రాంతంలో ఆయిల్బాల్స్ వేయాలని, బ్లీచింగ్పౌడర్ చల్లించాలన్నారు. దోమల నివారణకు గ్రామాల్లో ఫాగింగ్ చేయించాలని కోరారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి వచ్చే హరితహారం కార్యక్రమానికి సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో గౌడ సురేశ్, ఏపీవో అరుణ, ఈసీ కిశోర్ పాల్గొన్నారు.
జోరుగా పారిశుధ్య పనులు
చెన్నారావుపేట : డల కేం ద్రం లో బుధ వా రం స ర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని తొలగించి మురుగునీరు నిల్వ లేకుండా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా డుతూ వర్షాకాలం సీజన్ నేపథ్యంల పారిశుధ్య పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాలకిషన్గౌడ్, మంగ సాంబయ్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.