మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అఖండ (Akhanda) బాక్సాపీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయింది. మూవీ సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఇపుడు యాక్షన్ డ్రామా నేపథ్యంలో రామ్తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ న్యూస్ ప్రకటించడంతో సినీ లవర్స్ ఎక్జయిటింగ్కు లోనవుతున్నారు. కాగా కొత్త గాసిప్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika mandanna)ను ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్టు తెలుస్తోండగా..మరి బోయపాటి ఆఫర్కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేది చూడాలి. పుష్ప సినిమా తర్వాత ఇండియావైడ్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ఈ చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది.
శ్రీవల్లి రోల్లో అద్బుతంగా నటించి తన ఫాలోవర్లను సంఖ్యను మరింత పెంచేసుకుంది రష్మిక. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక మరి ఇస్మార్ట్ శంకర్తో రొమాన్స్ చేసేందుకు రెడీ అంటుందా..? లేదా అనేది చూడాలి.