బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు షారుఖ్ఖాన్కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
షారుఖ్ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. షారుఖ్ఖాన్ తిరుమల దర్శనం తాలూకు ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. కొద్దిరోజుల క్రితం షారుఖ్ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.