పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. బుధవారం ఆమె హైదరాబాద్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటింది.
ప్రకృతి బాగు కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చింది. ఆమె రంగోలి చందర్, డాక్టర్ రీతూ రనౌత్, అంజలీ చౌహాన్లకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ విసిరింది. అనంతరం ఆమెకు వృక్షవేదం పుస్తకాన్ని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ బహూకరించారు.