Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ నటిగా ఎదిగేందుకు కష్టపడుతోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసినప్పటికీ.. సినిమాల్లో మాత్రం గ్లామర్ కంటే నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. సినిమా సినిమాకు తన లోపాలను సరిదిద్దుకుంటూ నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తోంది. అయినప్పటికీ జాన్వీపై విమర్శలు ఆగడం లేదు. ఈమెకు నటన రాదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా తనపై వస్తున్న విమర్శలపై జాన్వీ కపూర్ తాజాగా స్పందించింది.
తనపై వస్తున్న ట్రోల్స్ చూసి చూసి విసిగిపోయానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది కావాలనే తప్పులు వెతుకుతున్నారని వాపోయింది. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వాళ్లకు అంత సంతోషమని.. మనల్ని విమర్శించడంలోనే వాళ్లు ఆనందం పొందుతారని చెప్పుకొచ్చింది. ఇది రెగ్యులర్గా కొనసాగుతోందని.. దీనివల్ల తరచూ వార్తల్లో ఉంటామని తెలిపింది. ఇలాంటి వార్తలు చూసి ప్రజలు కూడా కొంతకాలానికి విసిగిపోతారని చెప్పింది.
తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి నెపో కిడ్ అని ఎగతాళి చేస్తున్నారని బాధపడింది. తన సినిమా రిలీజైన ప్రతిసారి కావాలనే తనపై విమర్శలు చేస్తారని చెప్పుకొచ్చింది. యాక్టింగ్ రానప్పుడు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని గుర్తు తెచ్చుకుంది. వాటిని చూసి మొదట్లో బాధపడ్డానని.. కానీ ఇప్పుడు వాటికి అలవాటు పడిపోయా అని చెబుతోంది. ఇప్పుడు అలాంటి ట్రోల్స్ వస్తుంటే నవ్వుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తన బలాలు, బలహీనతలు ఏంటి? ఎలా నటిస్తున్నా అనే విషయాలు తనకు తెలుసని.. కాబట్టే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవద్దని అర్థమైందని తెలిపింది.