సినిమాలతో అభిమానులకు వినోదాన్ని అందించడమే కాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో పోస్ట్ పెడుతూ ఫాలోవర్లలో జోష్ నింపుతుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఈ స్టార్ హీరో తాజాగా ఓ ప్రత్యేక ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ బ్యాక్ లుక్లో దిగిన స్టిల్ పోస్ట్ చేశాడు. ఇంతకీ అక్షయ్ ఎక్కడికెళ్లాడనే కదా మీ డౌటు. గుజరాత్లోని ఏక్తానగర్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) దగ్గరకు వెళ్లాడు.
అక్షయ్ కుమార్ నర్మదా నదీ వంతెన రేలింగ్ కూర్చుని..స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైపు చూస్తూ..నేను ఏక్తా నగర్లో ఉన్నా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి నిలయం. ఇక్కడి ప్రకృతి ఒడిలో చేయాల్సింది చాలా ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నారా..? అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇటీవలే రామ్సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సెల్ఫీ సినిమా షూటింగ్ పూర్తయింది. ఓ మై గాడ్ 2, సూరారై పోట్రు హిందీ రీమేక్, క్యాప్సుల్ గిల్ చిత్రీకరణలో దశలో ఉన్నాయి. An Action Hero చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.
బ్రిడ్జి రేలింగ్పై అక్షయ్కుమార్..
I am in Ekta Nagar, home to ‘Statue of Unity’ the world’s tallest statue. So much to do here in the lap of nature.
Have you been here? pic.twitter.com/4UsVoWmw4N
— Akshay Kumar (@akshaykumar) November 13, 2022
Read Also : Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
Read Also :టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Read Also : Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్