బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తున్నది. శుక్రవారం నుంచి రాజస్థాన్లో కీలక షెడ్యూల్ మొదలైంది. స్టన్ శివ నేతృత్వంలో రాజస్థాన్ కోటలో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. పది రాత్రుల పాటు తెరకెక్కించే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన గత చిత్రాలకు భిన్నంగా పూర్తి మాస్ అవతారంలో కనిపిస్తారని, యాక్షన్తో పాటు ఎమోషనల్ కంటెంట్తో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, అనిత్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, రచన-దర్శకత్వం: సాగర్ కె చంద్ర.