కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినీ జనాలను పూర్తి స్థాయిలో థియేటర్లకు రప్పించిన చిత్రం అఖండ (Akhanda). బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణ (Balakrishna) డ్యుయల్ రోల్లో నటించాడు. అఖండ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. నిర్మాతలకు లాభాల పంట పండించింది.
బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిన అఖండ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (53rd International Film Festival of India) అఖండ ప్రదర్శితం కానుంది. అఖండ నవంబర్ 24న స్క్రీనింగ్ కానుంది. ఈ నెల 28వరకు చలన చిత్రత్సోవాలు కొనసాగనున్నాయి.
53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఓ వైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ అప్డేట్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు సినీ లవర్స్.
Natasimham #NandamuriBalakrishna & #BoyapatiSrinu's Hattrick Blockbuster #Akhanda 🔥will be screening at 53rd Indian Film Festival in Goa on Nov 24th Nov 2022 🙌@MusicThaman #IFFI53Goa #IFFI2022 #IFFI53 @IFFIGoa@dwarakacreation pic.twitter.com/1t8GkGqs0L
— BA Raju's Team (@baraju_SuperHit) November 23, 2022
Read Also : Kantara | కాంతార ఓటీటీ ప్లాట్ఫాం, విడుదల తేదీ ఫైనల్.. వివరాలివే