అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బాలకృష్ణ సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు సమాజసేవలో కూడా తన వంతు ముందుంటారు. ఈ టాలెంటెడ్ యాక్టర్కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ స్టార్ యాక్టర్ ఇటీవలే అడ్వర్టైజింగ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజా అప్డేట్ ప్రకారం బాలకృష్ణ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారట. ఇప్పటికే ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ కూడా షురూ చేసినట్టు టాక్. యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్ కు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించడం కోసం ఆస్పత్రిని విజయవంతంగా నడిపించేందుకు కృషి చేస్తూ.. మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు బాలకృష్ణ. నందమూరి హీరో గొప్ప మనసుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
వీరసింహా రెడ్డి చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టనున్నాడు బాలకృష్ణ.
Read Also : Vaarasudu | దీపావళి విషెస్తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్