నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవలే గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రధాన భాగంగా అమెరికా (America ) లోనే చిత్రీకరించనున్నారట.
సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటే విదేశాల్లో చిత్రీకరణ జరుపడం తక్కువే. అయితే ఈ సారి బాలయ్య కోసం డైరెక్టర్ గోపీచంద్ మలినేని యూఎస్ షెడ్యూల్ను కీలకంగా చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణను రెండు రోల్స్ లో చూపించేలా డిజైన్ చేశాడట గోపీచంద్ మలినేని. అయితే బాలకృష్ణ షూటింగ్ షెడ్యూల్ అమెరికాలోనే షురే అవుతుందా..? అనేది ప్రస్తుతానికి గాసిప్గానే ఉన్నా..దీనిపై మేకర్స్ ఏమైనా అప్డేట్ ఇస్తే స్పష్టత వచ్చే అవకాశముంది.
సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lavanya Tripathi Gossip | లావణ్య త్రిపాఠిపై సర్ప్రైజ్ గాసిప్ హల్చల్
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్