సినిమా అంటే రెండు నుంచి రెండున్నర గంటలే ఉండాలి. అంతకంటే ఎక్కువ నిడివి ఉంటే కష్టం. అంతసేపు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం దర్శకులకు పెద్ద పరీక్షే. దీంతో కొన్నిసార్లు కథ విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ఎంత ముఖ్యమైన సీన్లు ఉన్నప్పటికీ నిడివి దృష్ట్యా సినిమాను రెండు నుంచి మూడు గంటల్లోకి కుదించేస్తుంటారు. కానీ కథను కథగా చెప్పేందుకు దర్శకుడు రాజమౌళి కొత్త ట్రెండ్కు నాంది పలికాడు. కథ విషయంలో రాజీపడే బదులు.. దాన్ని రెండు భాగాలుగా చెప్పొచ్చని చూపించాడు. ఇలా రెండు భాగాలుగా కథను చెప్పడం వల్ల కథను కథలా చెప్పొచ్చని.. పైగా లాభాలు కూడా బాగానే వస్తాయని నిరూపించాడు జక్కన్న. దీంతో ఇప్పుడు ఈ ట్రెండ్ ఊపందుకుంది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని కేజీఎఫ్, పుష్ప ఇలా చాలా సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం..
బాహుబలి స్ఫూర్తితో కేజీఎఫ్ సినిమాను కూడా రెండు భాగాలుగా విడగొట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా.. సైలెంట్గా రిలీజై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో రెండో చాప్టర్ కోసం ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప సినిమా కూడా రెండు భాగాలుగా రానుంది. మొదట ఈ సినిమా మొత్తాన్ని ఒక్క పార్ట్గానే చూపించాలని అనుకున్నారు. దీంతో సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని కథను కాస్త కుదించాడు దర్శకుడు సుకుమార్. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో ఎలాగూ అయ్యే ఆలస్యం అవుతూ వస్తుంది కాబట్టి సినిమా కథ విషయంలో రాజీ పడొద్దనే నిర్ణయానికి వచ్చాడు సుకుమార్. కథను మరింత చక్కగా చెప్పేందుకు రెండో భాగాలుగా సినిమాను విడగొట్టాడు. ప్రస్తుతం తొలి భాగం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయబోతున్నారు.
తమిళ దర్శకుడు మణిరత్నం కలల చిత్రం పొన్నియిన్ సెల్వన్ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందబోతోంది. కల్కీ కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల ఆధారంగాe2f5f0 రూపొందుతుంది ఈ సినిమా. చోళుల కాలం నాటి చరిత్రను ఇందులో ప్రస్తావించారు. అయితే ఈ కథను కేవలం రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాకపోవడంతో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించే పనిలో పడ్డారు మణిరత్నం. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నితిన్ కథానాయకుడిగా విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా పవర్ పేట. ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల మధ్యవయస్కుడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో నితిన్ ఛల్ మోహనరంగా సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణచైతన్య పవర్ పేటకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నితిన్ ప్లేస్లో శర్వానంద్ నటించబోతున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
కళ్యాణ్రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా బింబిసార. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
నాగార్జున, అమితాబ్ బచ్చన్, రణ్బీర్కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం బ్రహ్మస్త్ర. ఇతిహాసాలతో ముడిపడిన సైన్స్ ఫిక్షన్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్