సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని.తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ మూవీ నిరాశపరచడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ సెలక్టెడ్ ప్రాజెక్ట్లు ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలు సాధించింది.
శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్లో కియారా కథానాయికగా ఎంపికైన విషయాన్ని రీసెంట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. కియారా బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యింపజేశారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లలో ఒకరిగా ఉన్న కియారా తన ప్రేమ విషయంతోను వార్తలలో నిలుస్తుంటుంది. సిద్ధార్థ్ మల్హాత్రాతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని టాక్.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్న కియారా అద్వాని అప్పుడప్పుడు హాట్ హాట్గా ఫొటో షూట్స్ చేస్తూ నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టాగ్రామ్లో పలు ఫొటోలు షేర్ చేసింది. ఇందులో కియారా ఏంజెల్లా కనిపిస్తుంది. కియారాని చూసి యూత్ ఫిదా అయిపోతున్నారు.