Baahubali The Epic | టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ ఇటీవల ఒక మాస్ వైబ్గా మారింది. అభిమానులు తమ ఫేవరెట్ హీరోల పాత బ్లాక్బస్టర్లను 4K టెక్నాలజీతో మళ్లీ థియేటర్లలో చూసి ఆస్వాదిస్తున్నారు. ఈ ట్రెండ్లో ఎన్నో సినిమాలు మంచి వసూళ్లను సాధించగా, రీ రిలీజ్లకు ప్రత్యేక మార్కెట్ ఉన్నదని నిరూపించాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇండియన్ సినిమా దిశను మార్చిన చిత్రం అడుగుపెడుతోంది. అదే బాహుబలి. అయితే, ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. మేకర్స్ పాత ప్రింట్ను మళ్లీ విడుదల చేయకుండా కొత్త హంగులతో బాహుబలి: ది ఎపిక్ పేరుతో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ వెర్షన్లో సినిమాటిక్ అప్గ్రేడ్స్తో పాటు ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని కొత్త సన్నివేశాలు (అన్సీన్ షాట్స్) కూడా ఉంటాయి.
ఈ కొత్త కంటెంట్, ఇప్పటికే వందల సార్లు ‘బాహుబలి’ను చూసిన ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. రీ రిలీజ్ ప్లానింగ్ వెనుక పెద్ద వ్యూహం ఉంది. ‘RRR’ చిత్రంతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును ఈ ప్రాజెక్ట్కు బూస్ట్గా ఉపయోగించాలనే ప్లాన్ ఉంది. జక్కన్న మేకింగ్ స్టైల్ను ఇష్టపడే గ్లోబల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ, ఓవర్సీస్లో భారీ ప్రమోషన్లతో ఈ ‘ఎపిక్’ వెర్షన్ను విడుదల చేయాలని చూస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఈ రీ రిలీజ్కు ప్రధాన అస్సెట్గా మారనుంది. రీ రిలీజ్ మార్కెట్లో ఇప్పటికే కొన్ని సినిమాలు తమ రికార్డులను సృష్టించాయి. తమిళంలో ‘గిల్లి’ 4K వెర్షన్ 32.50 కోట్లు, తెలుగులో ‘ఖలేజా’ 10.78 కోట్లు, ‘మురారి’ 8.90 కోట్లు, ‘గబ్బర్ సింగ్’ 8.01 కోట్లు వసూళ్లు సాధించాయి. ఇతర రీ రిలీజ్లు కూడా కొంత మేర విజయం సాధించాయి.
అయితే మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలకు ముందునున్నంత రెస్పాన్స్ లేదు. ఇప్పటికే ‘బాహుబలి’ను థియేటర్స్, టీవీ, ఓటీటీలో ఎన్నోసారి చూసిన అభిమానులు కేవలం పాత సినిమాను మళ్లీ థియేటర్లో చూడడానికి రావడం కష్టం. కాబట్టి, మేకర్స్ చెప్తున్న కొత్త కంటెంట్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఒరిజినల్ రిలీజ్లో బాక్సాఫీస్ వద్ద 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘బాహుబలి’, రీ రిలీజ్ రికార్డులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారింది. ఒకవేళ ఈ రీ రిలీజ్ అంచనాలను అందుకోకపోతే, భవిష్యత్తులో పెద్ద సినిమాల రీ రిలీజ్ విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది. ఈ రీ రిలీజ్ రీల్గా రీ రిలీజ్ మార్కెట్కు ఒక అగ్నిపరీక్షగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.