Daggubati Family | హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదానికి సంబంధించిన కేసులో సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి సహా నిర్మాత సురేశ్ బాబులకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నేడు విచారణకు రాగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నవంబర్ 14న జరగబోయే తదుపరి విచారణకు దగ్గుబాటి వెంకటేశ్తో పాటు, రానా, అభిరామ్, సురేశ్ బాబు తప్పనిసరిగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడానికి కచ్చితంగా నలుగురూ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్లపై గతంలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగానే దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టుకు రావాలంటూ సమన్లు పంపింది.