ప్రీతి జింగానియా (Preeti Jhangiani)..ఈ పేరు చెప్పగానే ఠక్కున పవన్ కల్యాణ్ సినిమా గుర్తొస్తుంది. తమ్ముడు (Thammudu) చిత్రంలో ఈ బ్యూటీ పోషించిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముంబై బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నరసింహనాయుడు (Narasimha Naidu) చిత్రంలో హీరోయిన్ గా నటించింది, యమదొంగలో స్పెషల్ సాంగ్ తోపాటు పలు తెలుగు సినిమాల్లో మెరిసింది. నాలుగేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ భామ ఓటీటీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకుంది ప్రీతి. ప్రేక్షకులు తనను చుయిముయి అమ్మాయి, మొహబ్బతిన్ అమ్మాయి అని పిలుస్తుంటారని చెప్పింది. తన కు ఈ రెండు ట్యాగులు వేయడం బాగానే ఉన్నా..ఆడియెన్స్ మాత్రం తనను మోడ్రన్ రోల్ కంటే చీరలో చూడటానికే ఇష్టపడటం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని అన్నది ప్రీతి జింగానియా. అంతేకాదు తాను ముద్దు సీన్లలో నటించడం కూడా ప్రేక్షకులకు నచ్చేది కాదని చెప్పుకొచ్చింది.
తనకు మాత్రం కెరీర్ లో విభిన్న పాత్రలను చేయాలని ఉందని, ఓ నిస్సహాయ కోడలిగా ఉండిపోవడం తనకిష్టం లేదని చెప్పింది. కేవలం ఒక జోనర్ కే పరిమితం కావడం ఎవరికైనా నచ్చదంటూ మనసులో మాటలను బయటపెట్టింది. బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పర్వీన్ డాబాస్ ను 2008లో పెళ్లి చేసుకుంది ప్రీతి జింగానియా. వీరికి ఇద్దరు పిల్లలు కాగా..ప్రస్తుతం ముంబైలోని బాండ్రాలో ఉంటున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!