‘మా చిత్రానికి అంతటా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్తో తీశారని అంటున్నారు. మా అంచనాలు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు మహేష్రెడ్డి. ఆయన దర్శకత్వంలో కార్తీక్రాజు, సిమ్రన్ చౌదరి జంటగా నూతలపాటి నరసింహం తెరకెక్కించిన ‘అథర్వ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘చాలా చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. క్లూస్ టీం కథాంశంతో వైవిధ్యమైన చిత్రమని అంటున్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన జర్నలిస్ట్ పాత్రకు మంచి గుర్తింపు దక్కిందని కథానాయిక సిమ్రన్ చౌదరి పేర్కొంది. తొలిరోజే చక్కటి ఆదరణ లభించడంతో సినిమా కోసం పడ్డ కష్టాన్ని మొత్తం మర్చిపోయామని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.