Prabhas-Maruthi Movie | గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రభాస్-మారుతి సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. తాజాగా చిత్రబృందం షూటింగ్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ మూడు రోజులు షూటింగ్లో పాల్గొన్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఏవి కూడా బయటకు రానివ్వకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతుందట. ఈ చిత్రానికి ‘రాజాడిలక్స్’ అనే టైటిల్ను చిత్రబృందం పరిశీలనలో ఉంచిందట.
ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కన్ఫార్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఫిక్సయిందట. ప్రస్తుతం కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అశికా రంగనాథ్ మూడో హీరోయిన్గా ఫైనల్ అయిందట. అయితే ఈ పాత్ర కోసం చిత్రబృందం పలువురు టాలీవుడ్ హీరోయిన్లను అనుకున్న చివరికి అశికాను ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమా మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో సాగుతుందట. ఇదే కథకి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి తన శైలిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్ను నిర్మించినట్లు తెలుస్తుంది. కేవలం ఈ సెట్ కోసమే మేకర్స్ 6కోట్లు ఖర్చు చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
Read Also:
Varsha Bollamma | బడా నిర్మాత కొడుకును పెళ్ళి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ?
Mahesh Babu | సూపర్స్టార్ అరుదైన ఘనత.. సౌత్లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
Jailer Movie | రజనీకాంత్ ‘జైలర్’ రిలీజయ్యేది అప్పుడేనా?
‘Thalapathy67’లో విజయ్ గ్యాంగ్స్టార్గా కనిపించనున్నాడా?