ప్రేమికులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ముంబై బ్యూటీ కామ్నా జెఠ్మలానీ. మహేశ్ బాబు హీరోగా నటించిన సైనికుడు చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత గోపీచంద్ తో రణం, అల్లరి నరేశ్ తో కత్తి కాంతారావు తోపాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బిజినెస్ మెన్ సూరజ్ ను పెండ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. కామ్నాకు ప్రస్తుతం ఇద్దరు కూతుళ్లు.
కాగా ఈ భామ టాలీవుడ్ కమ్ బ్యాక్ కు ప్లాన్ చేస్తుందట. కాజల్ కనిపించిన పక్కా లోకల్ లాంటి స్పెషల్ సాంగ్స్ లో నటించాలని ఉందని అలీతో సరదాగా టాక్ షోలో చెప్పింది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే చేయడానికి సిద్దంగా ఉన్నానంది. కన్నడ, మలయాళ సినిమాలు కూడా చేసిన కామ్నా జెఠ్మలానీ చివరి సారిగా 2015లో వచ్చిన శ్రీ జగద్దుగరు ఆది శంకర లో నటించింది.
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?