మొన్నామధ్య సందీప్రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా నుంచి తొలిపాటను విడుదల చేశారు. ‘అమ్మాయీ..’ అంటూ సాగే ఆ పాట జనబాహుళ్యంలో బాగానే వినిపించింది. ఈ శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘నే వేరే..’ అంటూ సాగే ఈ పాట సందీప్రెడ్డి అభిరుచికి నిదర్శనంలా అనిపిస్తుంది. మానవతా విలువలు, మనసుల్ని తాకే అనుభూతులు, వివాహం తర్వాత తలెత్తే సంక్లిష్టమైన విభేదాల నేపథ్యంలో ఈ పాట సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.
అనంతశ్రీరామ్ రచించిన ఈ పాటను శ్రేయాస్ పురాణిక్ స్వరపరిచారు. కార్తీక్ ఆలపించాడు. హీరోహీరోయిన్లు రణ్బీర్కపూర్, రష్మిక మందన్నా అనుబంధ, విభేదాలను ఆవిష్కరించేలా ఈ పాట ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సంప్రదాయ సరిహద్దులను దాటి, ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. డిసెంబర్ 1న ‘యానిమల్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.