టాలీవుడ్ (Tollywood) క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టు రంగమార్తాండ (Rangamarthanda). మరాఠి మూవీకి నటసామ్రాట్కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా డబ్బింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో అందాల తార అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తోంది. తాజాగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో మునిగిపోయింది అనసూయ.
స్టూడియోలో డబ్బింగ్ చెప్పుకుంటున్నపుడు తీసిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రంగమార్తాండకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. రంగమార్తాండలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, , బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. హౌస్ఫుల్ మూవీస్, రాజశ్యామ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్.
త్వరలోనే రిలీజ్ డేట్ క్లారిటీ ఇవ్వనుంది టీం. కృష్ణవంశీ చివరగా నక్షత్రం సినిమా తెరకెక్కించాడు. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తీస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈ దర్శకుడు అన్నం అనే సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.
Actress @anusuyakhasba starts dubbing 🎙️ for #Rangamarthanda@director_kv @kalipu_madhu pic.twitter.com/9dUNtmxpHB
— Vamsi Kaka (@vamsikaka) July 11, 2022