‘మంచి దర్శకుడి కథను వినడం కంటే వెండితెరపై చూడటానికే నేను ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్లో చూడాలనే దేవా కట్టా కథ చెబుతానన్నా ఇప్పటివరకు వినలేదు’ అని అన్నారు దర్శకుడు సుకుమార్. సాయితేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకుడు. జె. భగవాన్, జె పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్యారాజేష్ కథానాయిక. ఈ చిత్ర టీజర్ను సోమవారం హైదరాబాద్లో దర్శకుడు సుకుమార్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ప్రస్థానం’ విడుదలై చాలా ఏళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి కథ, అందులోని సెన్సిబులిటీస్, కథను కొత్తగా ఆవిష్కరించిన విధానమే కారణం. ‘రిపబ్లిక్’ సినిమా దేవాకు మంచి పేరు తీసుకురావాలి’ తెలిపారు. దేవాకట్టా మాట్లాడుతూ ‘సుకుమార్ సినిమాల్లో ‘రంగస్థలం’ చాలా ఇష్టం. ఆ సినిమా ప్రేరణతోనే ‘రిపబ్లిక్’ను తెరకెక్కించా’ అని చెప్పారు. ‘నిజాయితీతో చేసిన సినిమా ఇది. అందరిని మెప్పిస్తుందనే నమ్మకముంది. మణిశర్మతో సినిమా చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది’ అని సాయితేజ్ అన్నారు.
మరిన్ని వార్తలు చదవండి..