టాలీవుడ్ (Allu Arjun) స్టార్ హీరో అల్లు అర్జున్ (Puneeth Rajkumar) ఇవాళ ఉదయం బెంగళూరు పయనమయ్యాడు. దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ (Puneeth Rajkumar) నివాసానికి వెళ్లాడు. పునీత్కు నివాళులర్పించాడు అల్లు అర్జున్. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించాడు. పునీత్ మరణంతో తీరని లోటు ఏర్పడ్డ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.
2021 అక్టోబర్ 29న పునీత్ గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో కన్నడ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పునీత్ కు నివాళులర్పిస్తూ కర్ణాటకప్రభుత్వం ప్రత్యేక సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేసింది. పునీత్ రాజ్కుమార్ను మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna Award)తో సత్కరించింది. కర్ణాటక రత్న అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు.
సినీ పరిశ్రమ, సామాజిక కార్యక్రమాల ద్వారా అందించిన సేవలకు పునీత్ కు అవార్డు ప్రకటించగా..ఈ అవార్డు అందుకున్న పదో వ్యక్తిగా పునీత్ నిలిచాడు.
Allu Arjun stylist | అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద స్టార్ అవుతాడు: హర్మన్ కౌర్