Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్కు వర్చువల్గా హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. అల్లు అర్జున్ ముంబైలో సినిమా షూటింగ్లో ఉండడంతో నాంపల్లి కోర్టు వర్చువల్ విధానానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు అల్లు అర్జున్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరయ్యాడు.
అయితే ఈ కేసుకు సంబధించి మిగిలిన నిందితులు హాజరు కాకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై 500 పేజీల ఛార్జ్షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు. గత విచారణకు కూడా అల్లు అర్జున్ వర్చువల్గానే హాజరయ్యాడని తెలిసిందే. మొత్తం 23 మంది నిందితులు హాజరరైతేనే తదుపరి విచారణ ఉంటుందని కోర్టు గతంలో తెలిపింది.