కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఎలా ఉన్నా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో అందరి హీరోల కంటే ముందే ఉన్నాడు అల్లు అర్జున్. 2020లో అల వైకుంఠపురంలో చిత్రంతో ప్రేక్షకులకు మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ హిట్టునందించాడు బన్నీ. పుష్పతో మరో సూపర్ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఈ స్టార్ హీరో కొత్త లగ్జరీ ఇంట్లోకి మారాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతేకాదు ఆ లగ్జరీ ఇంటిలో అల్లు అర్జున్-స్నేహ ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
భవంతి లోపల పచ్చ గడ్డితో డిజైన్ చేయబడిన ఫ్లోర్ పక్కనే ప్లే గ్రౌండ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రెండు పార్టులుగా రానుంది పుష్ప.
ఇవి కూడా చదవండి..
జిమ్ కు డుమ్మా..అవుట్ డోర్ వాక్ లో పరిణీతి చోప్రా
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!