Allu Arjun | అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనపై అల్లు ఫ్యామిలీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్.. తన తాతతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తనకు 16 సంవత్సరాలు వచ్చే వరకు నాయనమ్మ, తాతయ్యలతోనే పెరిగినట్టు గుర్తు చేసుకున్నాడు బన్నీ. వాళ్లతో ఎన్నో మధుర జ్ఞాపకాలు తనకు ఉన్నాయని అన్నాడు. అలాగే తన తాత చనిపోయిన తర్వాత జరిగిన ఒక సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నాడు.
తన తాత అల్లు రామలింగయ్య చనిపోయిన తర్వాత తనకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చాయని చెప్పాడు అల్లు అర్జున్. అయితే రామలింగయ్యకు 8 మంది మనుమళ్లు, మనుమరాళ్లు ఉంటే ఎవరికీ రాని డబ్బు తనకే రావడంతో సంబరపడిపోయానని అన్నాడు. తనంటే తన తాతకు ఎంత ప్రేమో అని మురిసిపోయానని తెలిపాడు. కానీ అసలు నిజం తనకు తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చాడు బన్నీ. తను నాలుగో తరగతి ఉన్నప్పుడే తన తాతయ్య.. తన పేరుపై ఇన్సూరెన్స్ చేశాడని తెలిపాడు. ఎందుకంటే వీడు పెద్దయిన తర్వాత ఎందుకూ పనికిరాడు.. వేస్ట్ ఫెల్లో.. జీవితంలో ఏమీ చేయలేడు.. వీడికి 18 ఏండ్లు వచ్చిన తర్వాత ఈ 10 లక్షలు ఇస్తే ఏదో ఒకటి చేసుకుని బతుకుతాడని అల్లు రామలింగయ్య ఫీలయ్యాడట. అందుకే తన తాతయ్య తన పేరు మీద ఇన్సూరెన్స్ చేసినట్టు చెప్పాడు. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ను చెప్పి అందర్నీ నవ్వించాడు. అయితే వేస్ట్ ఫెల్లో అనుకున్న తను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానని.. ఇది చూడ్డానికి తాత లేకపోవడం బాధగా ఉందని చెప్పాడు బన్నీ. ఏదేమైనా తాత జయంతి వేడుకల్లో బన్నీ చేసిన ఈ కామెంట్స్ బాగానే వైరల్ అయ్యాయి.
చిరంజీవి మామూలోడు కాదు.. నవ్వుతూనే అన్నీ చెప్పేశాడు..”
అల్లు అర్జున్ మరో బాంబు.. తాత సాక్షిగా ఫ్యాన్స్ను చీల్చాడుగా..!”