Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం అరెస్ట్ అవ్వడంతో చంచల్గుడా జైలుకు తరలించగా.. హైకోర్ట్ మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు. అయితే ఉదయమే మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తనకు (Allu Arjun) అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. ఆ కుటుంబానికి మరోసారి నా క్షమాపణలతో పాటు సానుభూతి తెలుపుతున్నా. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. గత 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నా.. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ చెప్పుకోచ్చాడు.
#WATCH | Hyderabad | Actor Allu Arjun says, “…We are extremely sorry for the family. I will personally be there to help them in whatever way possible. I was inside the theatre watching a movie with my family and the accident happened outside. It has no direct connection with me.… pic.twitter.com/CJxd2JMxVK
— ANI (@ANI) December 14, 2024
Also Read..