చిత్రపరిశ్రమలో అనేక సమస్యలున్నాయని ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (AP CM Jagan Reddy) దృష్టికి తీసుకెళ్లారు. ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు అల్లు అరవింద్ సీఎం జగన్ కు వినతి పత్రం సమర్పించారు. కరోనా నుంచి ప్రజలను రక్షించినట్టుగానే సినీ పరిశ్రమను రక్షించాలని కోరారు. రాజు తలచుకుంటే వరాలకు కొదవ. సినీ పరిశ్రమ సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు.
సినీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. ప్రజలు థియేటర్లకు వస్తారన్న నమ్మకం కలిగింది. మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తాయి. సినీ పరిశ్రమలోని పలు సమస్యలపై నిర్మాత దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో సినీ నిర్మాతల బృందం బుధవారం ఏపీ మంత్రి పేర్ని నానితో ఇప్పటికే చర్చించింది. తమ విజ్ఞప్తులకు మంత్రి పేర్ని సానుకూలంగా స్పందిచారని దిల్ రాజు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆన్ లైన్ టికెటింగ్ విధానం ఎలా ఉండబోతుందనే విషయంపై త్వరలోనే మంత్రి నాని వివరిస్తారని ఇప్పటికే దిల్ రాజు తెలిపారు. టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ప్రసంగాలతో వైఎస్సార్సీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన