ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మ ఈమధ్యే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె.. ఇటీవల మరణించారు. ఇవాళ ( సెప్టెంబర్ 30న) ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తేజ్ను ఓదార్చారు. చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన్ను పట్టుకుని భోరున విలపించాడు. దాంతో ఉత్తేజ్ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు చిరంజీవి. నీకు మేమున్నాం అంటూ ఓదార్చాడు చిరు. హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు మురళి మోహన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డా. రాజశేఖర్, మెగా బ్రదర్ నాగబాబులతో పాటు పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటీనటులు హాజరై శ్రీమతి పద్మకు ఘన నివాళులు అర్పించారు.
ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే జీవితంలో ఎలాంటి బంధం అయినా విడిపోయినపుడు.. దూరం అయినపుడు కాలంతో పాటు మరిచిపోగలం కానీ భార్యాభర్తల బంధం మాత్రం అలా కాదన్నాడు చిరంజీవి. ఒకరిపై ఒకరు ఆధారపడి భార్యాభర్తలు ఉంటారని.. అందులో ఏ ఒక్కరు దూరమైనా కూడా జీవితాంతం ఆ లోటు తప్పదంటూ ఉత్తేజ్ భార్య పద్మ గారి మరణాన్ని ఉద్దేశించి చెప్పారు చిరంజీవి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరాడు మెగాస్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన
Posani: పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు
Singam: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిన సింగం నటుడు