బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీతారలను పశ్నించారు. డ్రగ్స్ సప్లయిర్స్తో సినీ తారల వాట్సప్ ఛాటింగ్ను బేస్ చేసుకొని ఎన్సీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఒక్క బాలీవుడ్లోనే కాక మాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్లలోను డ్రగ్స్ కేసులో పలువురు సినీ తారలని విచారించారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింగం’ సినిమాలో చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు. ఇప్పుడు ఆయన రియల్ లైఫ్లోను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకి చిక్కాడు. నిందితుడి నుండి 15 గ్రాముల ఎండీఎంఏ,7 లక్షల విలువైన 250 ml హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్లు, 2,500 నగదు, ఇంకా 8 లక్షల విలువైన డ్రగ్స్ ను అతని దగ్గర నుంచి తీసుకుని సీజ్ చేశారు.