కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న అపోహల్ని రూపుమాపి వారిని చైతన్యవంతుల్ని చేసేందుకు కథానాయిక అలియాభట్ సిద్ధమైంది. ఇందుకోసం పోడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ఆడియోమాటిక్పై ఐదు ఎపిసోడ్లతో ఓ సిరీస్ను నిర్మించబోతున్నది. ఈ సిరీస్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వైద్యరంగ నిపుణులు వ్యాక్సిన్ అవశ్యకతను తెలియజేయబోతున్నారు. ఈ సందర్భంగా అలియాభట్ మాట్లాడుతూ ‘వ్యాక్సిన్పై సోషల్మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ సురక్షితం కాదని భయపడుతున్నారు. వ్యాక్సిన్ చుట్టు అల్లుకున్న అపోహల్ని నివృత్తి చేసి ప్రజల్లో చక్కటి అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ సిరీస్ను తీసుకురాబోతున్నా. గ్లోబల్ హెల్త్ స్పెషలిస్ట్లు ఇందులో భాగమవుతున్నారు. వీడియో ఫార్మాట్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది’ అని అలియాభట్ పేర్కొంది. స్వీయనిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమె ఈ సిరీస్ను రూపొందిస్తోంది.