న్యూఢిల్లీ: అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న మిషన్ రాణిగంజ్ ఫిల్మ్కు చెందిన టైటిల్లో మార్పు చేశారు. మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ ఇండియా రెస్కూ అన్న టైటిల్లో భారత్ను జోడించారు. ఇండియా స్థానంలో భారత్ అని మార్చేశారు. అయితే భారత్ అన్న పదాన్ని జోడించిన టైటిల్తో ఉన్న ఓ ప్రోమో వీడియోను ఇవాళ అక్షయ్కుమార్ రిలీజ్ చేశారు. దీంతో నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. టైటిల్లో గతంలో ఉన్న ఇండియా ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. మీ తదుపరి చిత్రం భారతా అని మరో వ్యక్తి ప్రశ్నించాడు.
In 1989, one man achieved the impossible!
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj in cinemas on 6th October.
Teaser out tomorrow! pic.twitter.com/J0vFVq2v96— Akshay Kumar (@akshaykumar) September 6, 2023
1989లో జరిగిన ఓ యదార్ధ ఘటన ఆధారంగా మిషన్ రాణిగంజ్ చిత్రాన్ని తీస్తున్నారు. 350 ఫీట్ల లోతులో చిక్కుకున్న 65 మంది బొగ్గు గని కార్మికుల్ని కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కథాంశంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైనింగ్ ఇంజినీర్ జశ్వంత్ సింగ్ గిల్ పాత్రను అక్షయ్ పోషిస్తున్నాడు. అక్టోబర్ ఆరో తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రేపు టీజర్ రిలీజ్కానున్నది.