మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆరంభం’. అజయ్నాగ్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అభిషేక్ వీటి నిర్మిస్తున్నారు. మే 10న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులు ఓ విభిన్నమైన చిత్రాన్ని చూసిన అనుభూతికిలోనవుతారు. సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాను’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దేవ్దీప్గాందీ కుందు, సంగీతం: సింజిత్ యెర్రమిల్లి, సంభాషణలు: సందీప్ అంగిడి, దర్శకత్వం: అజయ్నాగ్ వీ.