హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చి బాక్సాపీస్ ను షేక్ చేస్తున్న చిత్రం అఖండ (Akhanda). బోయపాటి శ్రీను (Boyapati srinu), బాలకృష్ణ (Balakrishna)కాంబోలో మూడోసారి వచ్చిన అఖండ సెకండ్ లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తుంది. అఖండ డిసెంబర్ 2న విడుదలై నేటికి 25 రోజులు పూర్తి చేసుకుంది. నాలుగో వారంలో కూడా తన కంటెంట్, కటౌట్తో బాక్సాపీస్ను షేక్ చేస్తున్నాడు బాలయ్య.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోలతో లాంగ్ రన్ అవుతుంది అఖండ. బాక్సాపీస్ వద్ద అఖండ ఇప్పటివరకు రూ.125 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. అఖండ చిత్రాన్నిప్రేక్షకులు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారో చెప్పడానికి ఈ ఫిగర్ చాలు. బాలయ్య, బోయపాటి, థమన్ క్రేజీ కలయికలో యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన అఖండ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
సెకండ్ లాక్ డౌన్ తర్వాత అసలు థియేటర్లకు జనాలు వస్తారా..? రారా అనే డైలామాలో ఉన్న దర్శకనిర్మాతలకు నేనున్నా అంటూ ధైర్యంగా వచ్చి భరోసానిచ్చాడు బాలయ్య. అఖండ సినిమా కథే లాంగ్ రన్లో కూడా సినిమాకు ఇంత ప్రజాదరణ రావడానికి కారణమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.