కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసిన చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాడు.అఘోర పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. దీంతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 80 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో టిక్కెట్ రేట్స్ తక్కువగా ఉన్న సమయంలోను ఈ సినిమా ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమని అంటున్నారు. ఆరో రోజున కూడా మూవీ మంచి వసూళ్లే రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు రీమేక్ లు, సీక్వెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓటీటీలోకి సినిమా ఎప్పుడు వస్తుంది అని సందేహాలు మొదలయ్యాయి.
ముందు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నెల రోజుల వ్యవధిలోనే డిస్ని హాట్ స్టార్ లో అఖండ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విడుదలపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.