Aishwarya Rajinikanth | తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) విడిపోతున్నట్లు ప్రకటించిన (divorce) విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత దాదాపు రెండేళ్లకు ఇప్పుడు ఈ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. సెక్షన్ 13బీ కింద చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు (Chennai family court)లో సరస్పర అంగీకారంతో వీరు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలో వీరి కేసు విచారణకు రానున్నట్లు తెలిసింది.
కాగా, ధనుష్-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్ 18న ధనుష్ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాలలో కనిపించారు.
Also Read..
liquor policy Case | మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ సమన్లు.. కేజ్రీ వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలం నమోదు
Russia | మంచు కరిగి నిండిన నదులు.. రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
Vehicle Pile Up | రహదారికి అడ్డంగా వచ్చిన గేదె.. అంబులెన్స్ సహా 12 వాహనాలు ఢీ!