భోపాల్ : మధ్యప్రదేశ్లో సినిమా షూటింగ్.. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటిస్తున్న పాట షూటింగ్.. డ్యాన్సర్స్, టెక్నిషియన్స్ అంతా కలిపి దాదాపు 1500 మంది.. అయినా, ఒక్కరిలో కూడా కరోనా (No Corona) లక్షణాల కనిపించలేదు. దీనిని గొప్పగా చెప్తున్నారు ఆ సినిమా దర్శకుడు మణిరత్నం.
మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట షూటింగ్ శనివారం మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో జరిగింది. గ్వాలియర్, ఓర్చాల నుంచి వచ్చిన డ్యాన్సర్లతోపాటు మొత్తం 1500 మంది షూటింగ్లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నారు దర్శకుడు మణిరత్నం. షూటింగ్ సమయంలో ఎవరిలో కూడా కొవిడ్ లక్షణాలు బయటపడకూదని కఠిన చర్యలు తీసుకున్నారు. అందరికీ ముందస్తుగా రెండు డోసుల టీకాలు వేయించారు. ఎవరు కూడా జలుబు, దగ్గుకు గురికాకుండా చూసుకున్నారు. ప్రతీరోజు అందరికీ కొవిడ్ నిర్ధారిత పరీక్షలు చేయించిన తర్వాతనే షూటింగ్లో పాల్గొనేవారు. ఇందుకోసం నిత్యం దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. ప్రత్యేకంగా వంటలు చేసేందుకు 150 మందితో కూడిన వంట గదిని కూడా ఏర్పాటుచేశారు. తొలుత ఓర్చాలో ఆ తర్వాత గ్వాలియర్లో షూటింగ్ జరిపారు.
ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇక్కడ రెండు రోజుల పాటు ఉండి షూటింగ్ పూర్తి చేసుకున్నారని, షూటింగ్ 90 శాతం పూర్తయినట్లు సినిమా యూనిట్ తెలిపింది. మధ్యప్రదేశ్లో గత నెల 20 నుంచి నిర్విరామంగా షూటింగ్ చేస్తున్నారు. 10 వ శతాబ్దం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం థాయిలాండ్ నుంచి యాక్షన్ డైరెక్టర్లు కూడా పాల్గొంటున్నారు. దాదాపు 65 మంది స్టంట్మెన్లు సినిమా కోసం పనిచేస్తున్నారు. సినిమా కథను బట్టి షూటింగ్కు అనువైన ప్రాంతం మహేశ్వర్ కావడంతో ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
కేంద్ర మంత్రి భార్య, కుమారుడిపై లుకౌట్ నోటీస్
మెక్డోనాల్డ్స్లో త్వరలో కడక్ చాయ్, పసుపు పాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..