హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : విద్యా కమిషన్ నివేదిక 2026ను సరిచేయాలి అని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వినతిపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, కార్యదర్శి తాటికొండ రవి మాట్లాడుతూ విద్యా కమిషన్లో అనేక సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నివేదికలో చేయాల్సిన సవరణలపై ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి అని కోరారు.