Actress Namitha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 జరుగనున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు పోటీ చేయనున్నారు. ఇప్పటికే పలువురు తారలు తమ అదృష్టం పరీక్షించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జాబితాలో హీరోయిన్ నమిత సైతం చేరబోతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లుగా నమిత వెల్లడించింది. అయితే, ఎవరిపై పోటీ చేయబోతున్నదో స్పష్టం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న దళపతి విజయ్నే ఢీకొట్టబోతున్నట్లుగా తెలిపింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ పోటీ చేస్తాను. తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ సైతం రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నా’నని నమిత చెప్పింది. రాజకీయాల్లో నమిత ఎంట్రీ, విజయ్ పోటీ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విజయ్పై పోటీ చేస్తే నమితకు డిపాజిట్ కూడా రాదని అంటుండగా.. మరికొందరు నమిత గెలుపొందే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ఇక నమిత ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నది.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ ఇటీవల ‘తమిళక వెట్రి కజగం’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన విషయం విధితమే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. అసెంబ్లీ ఎన్నికల నాటికి వాటన్నింటిని పూర్తి చేసుకొని పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.