ముంబై: అసభ్య వీడియోలు, ఫొటోలు తీసి ఇంటర్నెట్లో వైరల్ చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం రాఖీ సావంత్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్లో అంబోలీ పోలీస్స్టేషన్లో దాఖలైన ఈ కేసులో విచారణ కోసం గత గురువారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించి ఆ తర్వాత విడిచిపెట్టారు.
ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ మళ్లీ అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసింది. అయితే కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. దాంతో ఆమె ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. కాగా, గత అక్టోబర్లో సాటి నటి, మోడల్ షెర్లిన్ చోప్రాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు తీసిన రాఖీ సావంత్ తర్వాత వాటిని ఇంటర్నెట్లో వైరల్ చేసింది.
దాంతో షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్పై కేసు నమోదైంది. అయితే రాఖీ సావంత్ కూడా షెర్లిన్ చోప్రాపై ఫిర్యాదు చేసింది. ఓ వీడియోలో షెర్లిన్ తనను అసభ్యపదజాలంతో దూషించిందని రాఖీసావంత్ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఆదిల్ ఖాన్ దురానీని పెండ్లి చేసుకోబోతున్న ఆమె ఇటీవల తన పేరును రాఖీ సావంత్ ఫాతిమాగా మార్చుకుంది.