తమిళ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. వీటికి లేజర్ ఎండోస్కోపీతో సర్జరీ నిర్వహించి తొలగించామని.. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని రెండు మూడు రోజుల్లో ఇంటికి పంపిస్తామని వైద్యులు వెల్లడించారు.
పలు తెలుగు, తమిళ చిత్రాల్లో తరుచూ కనిపించే ప్రభు ఇటీవల విజయ్ హీరోగా నటించిన వారసుడు చిత్రంలో కీలక పాత్రను పోషించారు.