ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆచార్య కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. అన్నింటికి మించి అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతోంది. ఈ సినిమాకు మొదటి నుంచి కలిసి రావడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. 2021, మే 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్తో సినిమా షూటింగ్ శరవేగంగా చేశారు. కానీ మధ్యలో కరోనా రావడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిపోయిన చిన్న చిన్న వర్కులను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్లాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.
సమ్మర్లో రిలీజ్ కుదరకపోవడంతో దసరా బరిలో దింపాలని కొరటాల ప్లాన్ చేసుకున్నాడు. అయితే దసరా కానుకగా అక్టోబర్ 13న రాజమౌళి ట్రిపుల్ ఆర్ విడుదల కానుంది. దీంతో దసరా బరిలో నుంచి ఆచార్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. పోనీ సంక్రాంతికి విడుదల చేద్దామంటే పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, వెంకటేశ్ వంటి పెద్ద హీరోలు ఇప్పటికే పండుగ పోటీకి సిద్ధమయ్యారు. ఇంతమంది స్టార్ హీరోల మధ్య పోటీలో ఆచార్య సినిమాను విడుదల చేయడం చిరంజీవికి ఇష్టం లేదు. అందుకే అన్ని సినిమాలు వచ్చి వెళ్లిన తర్వాత ఫిబ్రవరిలో లేదంటే సమ్మర్లో గానీ ఆచార్య విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేగానీ జరిగితే మెగా అభిమానులకు అంతకంటే నిరాశపరిచే అంశం మరొకటి ఉండదు. 2022 సమ్మర్కు ఆచార్య రిలీజ్ అంటే.. దాదాపు మరో 8 నెలల సమయం ఉంది. ఆ లోపు చిరు మరో రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేయొచ్చు. ఏదేమైనా ఆచార్య సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు