దాదాపు ఐదు ఏళ్లుగా ఇదిగో విడుదల.. అదిగో విడుదల అంటూ వస్తున్న ఆరడుగుల బుల్లెట్ సినిమా ఎట్టకేలకు అక్టోబరు 8న విడుదలైంది. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. మరెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్ని సహించి భరించి థియేటర్లలో విడుదలైంది. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆరడుగుల బుల్లెట్ థియేటర్లో వస్తుంది అని టీవీలో ఎంత ప్రమోట్ చేసిన కూడా ప్రేక్షకులు నమ్మలేదు. ప్రతిసారి ఇలాగే చెప్తారు లే అంటూ లైట్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ కూడా సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది.
ఐదేళ్ల కిందటి సినిమాకు తాను ఇప్పుడు ప్రమోట్ చేసిన కూడా లాభం లేదని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు గోపీచంద్. దీంతో గోపీచంద్, నయనతార, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్న కూడా కనీసం ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడలేదు. పైగా సినిమా కూడా అంతే రొటీన్గా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. ఎప్పుడో అర్థ దశాబ్దం కింద రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చింది అంటూ విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. మరోవైపు ఈ సినిమా కథ జూనియర్ ఎన్టీఆర్ అశోక్ తరహాలో ఉంది అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎటు చూస్తున్న కూడా హీరో ప్రమోషన్కు రాకపోవడం ఈ సినిమాపై బాగానే దెబ్బకొట్టింది.
గతంలో చిరంజీవి అంజి, నాగచైతన్య ఆటోనగర్ సూర్య, నాగార్జున ఢమరుకం లాంటి సినిమాల విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కువ కాలం ఆగి ఆగి విడుదలైన సినిమాలు విజయం సాధించడం చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది. ఇప్పుడు గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేశారు కానీ వసూళ్లు మాత్రం కేవలం లక్షల్లోనే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA Elections | ‘మా’ సభ్యులకు మోహన్బాబు వాయిస్ మెస్సేజ్
మా ఎన్నికల్లో గొడవలపై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు.. గొడవలు ఆగాలంటే..
Nayanathara: నయనతార ఇచ్చిన సర్ప్రైజ్కి షాక్ అయిన విఘ్నేష్ శివన్
Nayanthara |పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం
Nayanthara: విఘ్నేష్ శివన్..నయనతారని ప్రేమగా ఏ పేరుతో పిలుస్తాడో తెలుసా?
aaradugula bullet | ఆరడుగుల బుల్లెట్ సినిమాలో గోపీచంద్ ( Gopichand ) నయనతార ( nayanthara ) ప్రకాశ్ రాజ్ ( Prakash raj ) లాంటి స్టార్స్ ఉన్నారు