Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ‘చిత్ర లహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా వాలెంటైన్స్డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఓ మై ఆధ్య పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ యూట్యూబ్లో మంచి వ్యూస్ను సాధించింది. సినిమా టైటిల్ నుంచే ఈ చిత్రంపైన మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు రష్మిక హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. మహానుభావుడు తర్వాత ఇప్పటివరకు శర్వాకు మరో హిట్లేదు. గతేడాది వచ్చిన శ్రీకారం ప్రేక్షకులను, క్రిటిక్స్ ను ఆకట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయింది.
It's a WRAP!#AadavalluMeekuJohaarlu has completed its shooting formalities and is all set to entertain you in Theaters from Feb 25th ❤️ 😃#AMJOnFEB25@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @LahariMusic @TSeries pic.twitter.com/F8PthVX1CT
— SLV Cinemas (@SLVCinemasOffl) February 14, 2022