ప్రస్తుతం దేశంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కాల్పనిక గాథ నేపథ్యంలో రూపొందుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాపులర్ బాలీవుడ్ నిర్మాత.. పెన్ ఇండియా అధినేత (పెన్) జయంతిలాల్ గడా 475 కోట్ల మేర డీల్ ని కుదుర్చుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన అన్ని భాషలకు శాటిలైట్ – డిజిటల్ కి సంబంధించిన అన్ని హక్కులను ఆయన పొందారు.
ఇప్పుడు ఆయన నుంచి జీగ్రూప్ శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం సుమారు 325 కోట్లు చెల్లించి చేజిక్కించుకుంది. ఇది ఇప్పటివరకు ఈ కేటగిరీలో అతిపెద్ద డీల్. ఇండియన్ సినిమా చరిత్రలోనే దీనిని అతి పెద్ద డీల్గా చెబుతున్నారు. పెన్ ఇప్పుడు థియేటర్లలో RRR హిందీ వెర్షన్ ను మాత్రమే పంపిణీ చేస్తారు. ఇంకా హిందీ థియేట్రికల్ హక్కులు పెన్ సంస్థ వద్దనే ఉన్నాయి. మూవీని అక్టోబర్ 13న విడుదల చేస్తారా లేదంటే వాయాదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.